ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన చంద్రబాబు

By

Published : May 25, 2021, 9:41 PM IST

బెయిల్​పై విడుదలైన సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నరేంద్ర ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన చంద్రబాబునాయుడు
ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన చంద్రబాబునాయుడు

సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు భయపడవద్దని.. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంగం డెయిరీని కాపాడుకునేందుకు నరేంద్ర నేతృత్వంలో పాల ఉత్పత్తిదారులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని అన్నారు.

రేపు ఉదయం 9 గంటలకు దూళిపాళ్లను తెెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించనున్నారు.

ఇదీ చదవండి:

జైలు నుంచి విడుదలైన తెదేపా నేత ధూళిపాళ్ల, సంగం డెయిరీ ఎండీ

ABOUT THE AUTHOR

...view details