కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక విక్రయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థకు బాధ్యత ఎలా అప్పగిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విధానం సీఎంకే లాభమని, ప్రజలకు నష్టం కలుగుతుందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
ఇసుక విధానాలకు జనసేన వ్యతిరేకం: నాదెండ్ల మనోహర్
రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానాన్ని జనసేన తప్పుపడుతున్నట్లు ఆ పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ విధానంలో పారదర్శకత లేదని ఆయన ఆరోపించారు.
"ఇసుక విధానాలకు జనసేన వ్యతిరేకం"_జనసేన నేత నాదెండ్ల మనోహర్
TAGGED:
sand policy latest news