టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో రజతం గెలిచిన మీరాభాయి ఛానును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. తొలి పతకం గెలవటంపై దేశమొత్తం గర్విస్తోందని ట్వీట్ చేశారు. రజతం సాధించిన మీరాభాయి ఛానును సీఎం జగన్ అభినందించారు. ఒలంపిక్ క్రీడల్లో ప్రారంభమైన భారత ప్రదర్శనను చూడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మీరా భాయి ఛాను 49 కేజీల విభాగంలో రజత పతకం గెలిచారు.