ఆంధ్రప్రదేశ్

andhra pradesh

EAPCET: మే నెలలో ఈఏపీసెట్‌..

By

Published : Feb 10, 2022, 7:07 AM IST

AP EAPCET: ఏపీ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌)ను మే నెలలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ అనంతపురానికి అప్పగించారు.

EAPCET
EAPCET

EAPCET IN MAY: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌)ను మే నెలలో నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ అనంతపురానికి అప్పగించారు. సెట్‌ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి జేఎన్‌టీయూ, కాకినాడ ఈఏపీసెట్‌ నిర్వహిస్తూ వస్తుండగా.. ఈసారి మార్పు చేశారు.

ABOUT THE AUTHOR

...view details