ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

By

Published : Jun 21, 2022, 9:00 PM IST

9pm top news

.

  • పాఠశాలల పునఃప్రారంభం తేదీలో మార్పు
    రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకోవాల్సిన బడులు జూలై 5న తెరుచుకోనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేస్తున్నట్ల ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రహదారుల మరమ్మతులపై జగన్ ఆదేశం: మంత్రి సురేశ్
    రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్​వోబీల నిర్మాణాలను వచ్చే నెల 15 లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశాఖలో స్థలాల విక్రయంపై హైకోర్టు స్టే
    విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో ఓపెన్ ప్లాట్లను ఆన్​లైన్ ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన వేలం ప్రకటనపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఇంకా సమయం ఉంది.. ఏ నిర్ణయమూ తీసుకోలేదు'
    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.., పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..
    రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అగ్నిపథ్​పై తగ్గేదే లేదు.. ఆ విషయంలో మోదీకి సాటిలేరు'
    'అగ్నిపథ్'​పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ స్పందించారు. సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణల్లో భాగంగానే అగ్నిపథ్​ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనా కీలక ప్రయోగం విజయవంతం
    మధ్యంతర దశలో (మిడ్‌కోర్స్‌) అస్త్రాన్ని నేలకూల్చే యాంటీబాలిస్టిక్‌ క్షిపణి (ఏబీఎం)కి సంబంధించిన సాంకేతిక పరీక్షను చైనా విజయవంతంగా నిర్వహించింది. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య అని, ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది కాదని చైనా రక్షణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆమె'గా మారిన ఎలాన్​ మస్క్ కుమారుడు
    టెస్లా అధినేత కుమారుడు తన పేరును మార్చుకోనున్నారు. ఇప్పటికే లింగమార్పిడి చేసుకోగా తాజాగా ఆమెగా మారిన నేపథ్యంలో.. పేరును మార్చాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టాప్​ 10లో భారత్​ నుంచి స్మృతి మంధాన మాత్రమే!
    మహిళల వన్డే ర్యాంకింగ్స్​ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). టాప్​ 10 బ్యాటర్ల జాబితాలో టీమ్​ఇండియా నుంచి స్టార్​ ఓపెనర్ స్మృతి మంధాన మాత్రమే నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆమెతో చైతూ డేటింగ్!'.. 'ఎదగండి అబ్బాయిలూ..' అంటూ సమంత ట్వీట్
    హీరోయిన్​ సమంత.. తనను ట్రోల్​ చేసేవారికి గట్టి సమాధానమిచ్చింది. తనను విమర్శించడం మానేసి పని, కుటుంబం మీద దృష్టి పెట్టాలని సమాధానమిచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details