- కొత్తగా 2,930 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 35,871 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్ర హోంశాఖ స్పందన
సీఐడీ (AP CID) అదనపు డీజీ సునీల్కుమార్పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్కుమార్ వ్యవహారంపై వచ్చిన 3 ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్ను ఆదేశించింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ సీఎస్కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలీస్ స్టేషన్ ఎదుటే..
నందవరం పోలీస్ స్టేషన్లో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత.. పది రోజులు క్రితం పొలానికి వెళ్లగా ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. రెండు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ దంపతులు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో ప్రస్తుత నీటి నిల్వ 3.07 టీఎంసీలు ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ నియమితులయ్యారు. దెహ్రాదూన్లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జలఫిరంగుల ప్రయోగం