ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ నాయకులపై దాడి హేయమైన చర్య : మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు - YSRCP Mob Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 1:20 PM IST

ysrcp_mob_attack

YSRCP Mob Attacks TDP Leader in Anantapur District : అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి కృష్ణా నాయక్​పై వైసీపీ మూకలు దాడి చేశారు. వైసీపీ అభ్యర్థి మెట్లు గోవిందా రెడ్డి నామినేషన్​ ప్రక్రియ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ సమీపంలో కృష్ణా నాయక్​పై దాడి చేసి పిడి గుద్దుల వర్షం కురిపించారు. దీనిని గమనించిన స్థానికులు బాధితుడిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వైసీపీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి నామినేషన్ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ శ్రేణులు దాడులు చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో బలహీన వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. గతంలో కూడా టీడీపీ నాయకులపై జరిగిన దాడులను ఖండించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details