ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నగరిలో రోజా దోపిడీకి అడ్డేలేదు- ఆమె ఇంట్లో నలుగురు మంత్రులు : షర్మిల - YS Sharmila on Roja

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 1:08 PM IST

YS Sharmila Allegations Against Minister Roja: నగరిలో రోజా దోపిడీకి అడ్డేలేదని మట్టి మాఫియాలో దోచిన డబ్బులలో కొంత ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రోజా, ఆమె భర్త, ఇద్దరు సోదరులు మంత్రుల మాదిరిగా పెత్తనం చెలాయిస్తున్నారని ప్రజలు తన దృష్టికి తెచ్చినట్లు షర్మిల తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన న్యాయయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, నగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. పుత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి రోజాపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేసిన ఘనత సీఎం జగన్మోహన్‍ రెడ్డికే దక్కిందన్నారు. 

నాలుగున్నర సంవత్సరాల పాటు నిద్ర పోయిన జగన్‍ ఎన్నికల ముందు నోటిఫికేషన్‍, ఉద్యోగాలంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. జగన్ హామీలన్ని మద్యం షాపులో కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని అధికారంలో వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇళ్లులేని పేద కుటుంబానికి 5 లక్షలతో ఇల్లు, ప్రతి మహిళ పేరు మీద ఏటా లక్ష రూపాయలు ఇస్తామన్నారు. వృద్దులు, వితంతువులకు 4 వేల రూపాయలు, వికలాంగులకు 6 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details