ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ నేతల నామినేషన్​ ర్యాలీకి జనాలు కరవు - డబ్బులిచ్చి మరీ తరలింపు - వీడియో వైరల్​ - Money distributed nomination rally

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 1:50 PM IST

YCP Leaders Distribute Money Come to Election Campaign: వైసీపీ అభ్యర్థుల ప్రచారం, నామినేషన్లకు జనం లేకపోవడంతో డబ్బులు ఇచ్చి మరీ జనాలను ఆ పార్టీ నేతలు సమీకరిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ అభ్యర్ధి అన్నా రాంబాబు నామినేషన్ ర్యాలీకి రావాలంటూ ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున పంపిణీ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అధికార పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

7వ వార్డ్ కౌన్సిలర్ కొత్త కృష్ణ స్వయంగా డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్నా రాంబాబు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతల తీరుపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో డబ్బుల పంపిణీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details