ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటర్లతో రద్దీగా ఒంగోలు బస్టాండ్ - ఆర్టీసీపై ప్రయాణికుల ఆగ్రహం - VOTERS PROBLEMS DUE TO NO BUSES

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 12:15 PM IST

ఓటర్లతో రద్దీగా ఒంగోలు బస్టాండ్ - ఆర్టీసీపై ప్రయాణికుల ఆగ్రహం (ETV Bharat)

VOTERS PROBLEMS DUE TO NO BUSES : సోమవారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో  తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న ప్రజలకు బస్సుల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చిన ప్రయాణికులతో ఒంగోలు బస్టాండ్‌ కిక్కిరిసిపోయింది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు సమయానికి బస్సులు లేకపోవడంతో చిన్న పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

NO Special Buses For Voters : హైదరాబాద్, గుంటూరు, విజయవాడ దూర ప్రాంతాల నుంచి బస్టాండ్​కు వచ్చామని, ఆర్టీసీ సిబ్బందిని బస్సులు ఎప్పుడు వస్తాయో అని అడిగినా వారు చెప్పటం లేదని ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒంగోలు నుంచి స్వగ్రామాలకు వెళ్లడం మరింత నరకప్రాయంగా మారిందని వాపోయారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సుల్లో అదనంగా చెల్లించి వచ్చామని తెలిపారు. రద్దీకి తగ్గట్లు బస్సులు నడపలేక ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది. సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పోనీ ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల బాదుడుతో వెనక్కి తగ్గుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details