ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తే- దేహశుద్ధి ఇలాగే ఉంటది మరి! - youth Tried to cast fake votes

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 9:27 PM IST

దొంగ ఓట్లు వేసేందుకు యత్నం - మోకాళ్లపై నిల్చోబెట్టి మరీ కొట్టిన సీఆర్​పీఎఫ్ బలగాలు (ETV Bharat)

Youth Tried to Cast Fake Votes in Tirupati: తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో దొంగ ఓట్లు వేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తిరుపతి నగరంలో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు దేహశుద్ది చేశారు. నగరంలోని దొడ్డాపురం వీధిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను సీఆర్​పీఎఫ్ బలగాలు పట్టుకున్నారు. అంతే కాకుండా దొంగ ఓటు వేసేందుకు రావడమే కాకుండా వాగ్వాదానికి దిగడంతో వారికి తమదైన శైలిలో దేహశుద్ది చేశాయి ప్రత్యేక భద్రతా దళాలు. 

అదే విధంగా తిరుపతి నగరంలోని రాయల్‍ నగర్‍, ఖాదీకాలనీ ప్రాంతాలలో సైతం దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను బీజేపీ, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలదీయడంతో పోలింగ్‍ కేంద్రం నుంచి వెనుతిరిగారు. దొంగ ఓట్లు వేయడానికి వస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details