ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వేగంగా దూసుకొచ్చిన కారు- క్షణాల్లో తల్లీకూతురు దుర్మరణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 1:44 PM IST

two_people_died_in_road_accidents_in_kurnool_district

Two people Died in road accidents in Kurnool District : కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొని తల్లి, కుమార్తె మృతిచెందారు. జయలక్ష్మి (35) మరిది కుమార్తె రాజేశ్వరిని (6) తీసుకొని పొలానికి వెళ్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కారు పొలాల్లోకి దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయింది. ఒకే ఇంట్లో ఇద్దరి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
Two people Died in  car Accident : వారిద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జాతీయ రహదారిపై అతి వేగంతో వెళ్తున్న కారు, పొలానికి వెళ్తున్న వీరిపైకి దూసుకొచ్చింది. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందిన వారిని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా అసలు కారు ఎవరిది, డ్రైవర్​ ఎవరు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details