ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గన్నవరంలో టీడీపీ నేత యార్లగడ్డ నిరసన దీక్ష- స్థానికంగా వైరల్​గా మారిన వైసీపీ దాడుల దృశ్యాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 4:57 PM IST

Updated : Jan 27, 2024, 5:35 PM IST

TDP Leaders Protest  in Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం, పార్టీ నాయకుల ఇళ్లు, వ్యక్తులపై భౌతిక దాడులను నిరసిస్తూ పార్టీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రశాంతమైన గన్నవరంలో అల్లర్లతో నిత్యం ఏదో అలజడిని వైసీపీ సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ఇప్పటివరకు కార్లపై దాడులు జరిగిన ఉరుకున్నామని, ప్రస్తుతం భౌతిక దాడులకు ఎమ్మెల్యే అనుచరులు తెరతీస్తున్నారని ఇకపై సహించేది లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి సిద్ధం అంటూ బహిరంగ సభ ప్రారంభిస్తున్నారు, దేనికి సిద్ధం రాష్ట్రాన్ని నాశనం చేయడానికా? ప్రజలు కూడా జగన్​ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని నేతలు ఎద్దేవ చేశారు. పోలీసులు పబ్లిక్ సర్వెంట్లుగా పనిచేస్తున్నారా లేక వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారా అని నేతలు మండిపడ్డారు. నాయకులపై దాడులకు సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చినా చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారని, నిందితులను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని పోలీసులను హెచ్చరించారు. 

Last Updated :Jan 27, 2024, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details