ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: నరసాపురంలో చంద్రబాబు ప్రజాగళం సభ - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Prajagalam MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 5:52 PM IST

Updated : Apr 5, 2024, 6:56 PM IST

Chandrababu Prajagalam Live in Gopalapuram : ప్రజాగళం రెండో విడతలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. 5 రోజులకు రెండో విడత ప్రజాగళం యాత్ర ఖరారైంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ప్రజాగళం పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాకా ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. నేడు నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం నరసారపురం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అదే విధంగా 6వ తేదీన పెదకూరపాడు, సత్తెనపల్లి, 7వ తేదీన పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌షోలలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పటికే కొత్తపేట, రామచంద్రాపురం, కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహించారు. ఇక ఈరోజు నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం నరసాపురంలో చంద్రబాబు ప్రజాగళం ప్రత్యక్ష ప్రసారం మీకోసం. 
Last Updated : Apr 5, 2024, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details