ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో చికెన్‌ తిని 42 మంది విద్యార్థులకు అస్వస్థత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 9:05 PM IST

Students get Food Poisoning After Eating Chicken in Govt Hostel: ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని వసతి గృహంలో విషపూరితమైన ఆహారం తిని 42 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జీలుగుమిల్లిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థులకు చికెన్ వండారు. ​దీన్ని తిన్న విద్యార్థులు కొద్దిసేపటి తరువాత కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు హాస్టల్​కు చేరుకుని విద్యార్థులను పరీక్షించారు. చికెన్‌ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందిన వెంటనే ఎంపీడీవో వసతి గృహానికి చేరుకుని అధికారులను ఆరా తీశారు. అదే విధంగా విద్యార్థులను సైతం ప్రశ్నించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై వంట ఆయాల నుంచి కూడా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details