ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు వ్యక్తులు మృతి - Road Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 2:06 PM IST

Road Accident in Anantapur District : అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. రోటరీ పురం గ్రామం ఎస్​ఆర్​ఐటీ ఇంజనీరింగ్​ కళాశాల సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం-తాడిపత్రి జాతీయ రహదారిలో ద్వి చక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పీవీకేకే ఇంజనీరింగ్​ కళాశాల బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

Two People Died in the Accident : స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని ఏసన్న (40), బడప (35) గా పోలీసులు గుర్తించారు. వీరిది కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం బలపనూరు గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైనా పీవీకేకే కళాశాల బస్సును అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details