ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE ఇంకొల్లులో "రా కదలి రా" సభలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 3:15 PM IST

Updated : Feb 17, 2024, 6:17 PM IST

Ra Kadali Ra Meeting: బాపట్ల జిల్లాలోని ఇంకొల్లులో తెలుగుదేశం ఆధ్వర్యంలో 'రా కదలి రా' సభ నిర్వహించనున్నారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యహ్నం రెండు గంటలకు ఈ సభ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ''రా కదలిరా '' భారీ బహిరంగ సభకు లక్ష మందికిపైగా హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు టీడీపీ పూర్తి చేశారు. అధిక సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ సభలో పాల్గొన్నారు. 

అయితే ఈ సభను నిర్వహించడాన్ని ఇప్పటికే పోలీసులు అడ్జకున్న విషయం తెలిసిందే. పర్చురు నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఈ సభకు  ప్రభుత్వం ఏర్పాట్ల దశ నుంచే ఆటంకాలు సృష్టించింది. అన్ని అడ్డంకులను అధిగమించి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయడంతో  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రా కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి విషయాన్ని తెలియజేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో  పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసే దిశగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ టికెట్లు రాని నాయకులకు అధికారంలోకి రాగానే సముచిత ప్రా‌ధాన్యమిస్తామని చెప్పారు.

Last Updated : Feb 17, 2024, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details