ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: ప్రధాని మోదీ 'మన్‌ కీ బాత్' కార్యక్రమం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 11:03 AM IST

Updated : Jan 28, 2024, 11:31 AM IST

pm modi manki baath

PM Modi Mann ki Baat Live : ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. 2014 అక్టోబర్‌ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. అప్పటి నుంచి ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రజలనుద్దేశించి మోదీ తన మనసులోని మాటలను పంచుకుంటున్నారు. గత నెల 2023 మన్‌ కీ బాత్‌లో ప్రధాని పాల్గొని దేశం ఎన్నో ఘనతలు సాధించిందని గుర్తు చేశారు. తాజాగా నేడు ఏర్పాటు చేసిన మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు.

Last Updated :Jan 28, 2024, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details