ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Live:నరసాపురం వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కల్యాణ్- ప్రత్యక్ష ప్రసారం - Varahi Yatra Live from Narasapuram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 6:44 PM IST

Updated : Apr 21, 2024, 7:49 PM IST

Pawan Kalyan Varahi Yatra Live
Pawan Kalyan Varahi Yatra Live: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరి ర్యాలీ కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. త్వరలో కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ దోపిడిపై విచారణ చేపడతామని పవన్ హామీ ఇచ్చారు. రాయి దాడి విషయంలో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.    వైఎస్ జగన్​ను భయపెట్టే భారీ మెజారిటీ ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని ఉద్ఘాటించారు.  మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం లో 40వేల కోట్లు దోచుకున్నాడని పవన్ ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేయకపోగా కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలు హరిస్తున్న వైసీపీని తన్ని తరిమేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అరాచకం చేసిన వైసీపీ రౌడీలను మాత్రం వదలదని పవన్ హెచ్చరించారు.  
Last Updated :Apr 21, 2024, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details