ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE మంగళగిరిలో స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి- ప్రత్యక్ష ప్రసారం - Lokesh Wife Nara Brahmani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 6:09 PM IST

Updated : Apr 29, 2024, 6:46 PM IST

lokesh_wife_nara_brahmani_meet_with_women_-live_from_mangalagiri
Lokesh Wife Nara Brahmani Meet with Women  Live from Mangalagiri : మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. తాడేపల్లి, నులకపేట చైతన్య తపోవన్ శ్రేయో మండపంలో తాడేపల్లి మండల స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో సమావేశం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో బ్రాహ్మణి సమావేశమై వారితో కలిసి పూలు కోశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబుని గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బ్రాహ్మణి అన్నారు. రాష్ట్రంలో ఉపాధి దొరక్క మహిళా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. వారితో కలిసి పూలు కోశారు. మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళా కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమలు లేక పిల్లలకు ఉపాధి లభించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరిలో స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 29, 2024, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details