ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మల్లన్న మహాకుంభాభిషేకానికి ముహూర్తం ఖరారు- ఈ నెల 21న నిర్వహణకు దేవస్థానం సంసిద్ధం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 5:27 PM IST

Updated : Feb 7, 2024, 5:37 PM IST

high_court_on_srisailam_maha_kumbhabhishekam

High Court on Srisailam Maha Kumbhabhishekam : శ్రీశైలం దేవస్థానంలో మహాకుంభాభిషేకం నిర్వహణపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 16 నుంచి శ్రీశైలం దేవస్థానంలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించి 21న మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని దేవాదాయశాఖ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కుంభాభిషేకం నిర్వహణకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను దేవాదాయశాఖ న్యాయవాది కోర్టుకి అందజేశారు. ఈ వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం పిల్ పై విచారణ మూసివేసింది.
Srisailam Mallanna Maha Kumbhabhishekam Events From Feb 16 to 21:  నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరగవలసిన మహా కుంభాభిషేకం వాయిదాల పర్వం ముగిసింది. గతేడాది మేలో జరగవలసిన మహాకుంభాభిషేకం ఎండలు ఎక్కువగా ఉన్నాయని, భక్తులు క్షేత్రానికి రాలేరన్న నెపం చూపిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ వాయిదా వేయడం విదితమే. మహాకుంభాబిషేకం నిర్వహణ ముహూర్తం నిర్ణయించేందుకు దేవస్థానం ఏడు నెలలు సమయం తీసుకోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.

Last Updated :Feb 7, 2024, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details