ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్ సరఫరాపై అధికారుల నిర్లక్ష్యం - అన్నదాతల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 4:53 PM IST

Farmers Protest For Power Supply

Farmers Protest For Power Supply: విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వాలంటూ విద్యుత్ కార్యాలయం వద్ద రైతులు నిరసన చేపట్టారు. అనంతపురం జిల్లా కంబదూరు పి. వెంకటంపల్లి రైతులు విద్యుత్‌ సరఫరా ఇవ్వట్లేదంటూ నిరసనకు దిగారు. విద్యుత్‌ కార్యాలయానికి తాళాలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. తాళ్లూరు గ్రామ పరిధిలోని రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా ఇవ్వలేదని వారు అధికారులను ప్రశ్నించారు. అధికారులు తమకు సంబంధం లేదని, ఇతర అధికారులతో వెళ్లి మాట్లాడుకోండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యుత్ శాఖ అధికారులు రైతుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గత 6నెలలుగా ఎన్నో సార్లు ధర్నా చేశాం కానీ మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. వారానికి రెండు సార్లు మోటార్లు కాలిపోతున్నాయి. వాటిని రిపేర్ చేయించడానికి దాదాపు 8వేల నుంచి 10వేల వరకు ఖర్చు అవుతుంది. 7గంటలు ఇవ్వాల్సిన కరెంటును సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. తమకు న్యాయం చేయని ఏఈ, జేఈని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం.-బాధిత రైతులు

ABOUT THE AUTHOR

...view details