ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హామీ ఇచ్చి అన్నదాతలను నిండా ముంచిన అధికారులు- ఆదుకోవాలని వేడుకోలు - Farmers Facing Lack of Irrigation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 12:35 PM IST

Farmers Facing Lack of Irrigation Water Problem in Konaseema District : కోనసీమ జిల్లాలో రబీ పంట వేసిన రైతులు ఆవేదన చెందుతున్నారు. చివరి ఆయకట్టు పొలాలకు నీళ్లు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారులు సాగు నీరిస్తామని హామీ ఇవ్వడంతో ముందుకొచ్చి వరిసాగు చేశామని తెలిపారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో అధికారులు చేత్తులు ఎత్తివేయడంతో వరి పొలాలు బీటలు వారుతున్నాయని రైతులు లబోదిబో మంటున్నారు.

అధికారులు నీళ్లు ఇవ్వకపోవడంతో ఆయిల్​ ఇంజన్లతో వరి పంటకు సాగునీరు అందిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల కోసం ఎకరాకు రూ.10000 ఖర్చు చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. వరికి సాగునీరు ఇవ్వాలని కలెక్టర్​కు ఎన్ని సార్లు వినతి పత్రాలను అందించిన ఎలాంటి ఫలితం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటిగా లేదని ఈ సందర్భంగా తెలిపారు. వరి పంటకు సాగునీరు అందించి తమల్ని ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details