ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అభివృద్ధికే మా ఓటు - ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి: కొత్త ఓటర్లు - INTERVIEW WITH FIRST time VOTERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 9:57 AM IST

First Time Voters Opinion (ETV Bharat)

ETV Bharat Interview With First Time Voters : నాయకులు దూరదృష్టితో ఆలోచించినప్పుడే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఓటేయబోతున్న యువత అభిప్రాయపడుతోంది.  ఓటు రాష్ట్ర భవిష్యత్​పై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘంతో పాటు ఈనాడు - ఈటీవీ - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలతో ఈ సంవత్సరం ఏపీలో పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదయ్యారు. 

Andhra Pradesh Elections 2024 : ఓటు అనేది ఐదు సంవత్సరాలకు వచ్చే వేసిది కానీ ఓటు మన భవిష్యత్​ను నిర్ణయించే పెద్ద పరీక్షంటున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వం పాలన చేస్తున్న ఆయా ముఖ్యమంత్రులు ఇతర దేశాలకు వెళ్లి మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు వచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. మంచి నాయకుడితోనే రాష్ట్రాభివృద్ది సాధ్యపడుతుందని అన్నారు. తాము మొదటిసారి ఓటు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచి వ్యక్తికి ఓటు వేయాలని అంటున్న యువ ఓటర్లతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details