ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం - ప్రత్యక్ష ప్రసారం - CHANDRABABU ELECTION CAMPAIGN 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 4:55 PM IST

Updated : May 7, 2024, 6:00 PM IST

Chandrababu Prajagalam live in Punganur of Chittoor District : చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్ అక్రమాలపై చర్యలు చేపడతామన్నారు. జగన్​కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. స్వంత కుటుంబానికి న్యాయం చేయని సీఎం రాష్ట్ర  ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి మ్యని ఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ప్రజల భూములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ప్రజల జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే నాన్యమైన మద్యం సరఫరా అయ్యేట్లు చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 7, 2024, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details