ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం- రెప్పపాటులో ఇద్దరు దుర్మరణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 1:12 PM IST

bike_accident_two_died_in_anantapur_district

Bike Accident Two Died in Anantapur district : అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని కరిడికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు జిల్లా కేంద్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటుతున్న సలార్‌ భాషాను హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న బుల్లెట్ బైక్ వేగంగా ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో సలార్‌భాషతో పాటు బుల్లెట్ బైక్ లో  ప్రయాణిస్తున్న హెచ్​సీఎల్​ (HCL) కంపెనీ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ భువనచంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. 

Road Accident An Andhra Pradesh : విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల (Died) వద్ద లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు ఇద్దరు అనంతపురం (Anantapur) పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details