ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: సింహాద్రిపురంలో ఏపీ న్యాయ యాత్ర - పాల్గొన్న షర్మిల - ప్రత్యక్ష ప్రసారం - AP Nyaya Yatra APCC YS Sharmila

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 6:08 PM IST

Updated : Apr 12, 2024, 7:02 PM IST

AP Nyaya Yatra APCC YS Sharmila visit Kadapa Live : ఏపీ న్యాయ యాత్ర, APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 5 నుంచి షర్మిల వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఉగాది, రంజాన్‌ పండగలు రావడంతో 9, 10, 11 తేదీల్లో విరామం ఇచ్చారు. తిరిగి ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు వేంపల్లె సభలో మాట్లాడి అక్కడ నుంచి వేముల మీదుగా పులివెందుల చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. తర్వాత లింగాల మీదుగా సింహాద్రిపురం చేరుకున్నారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30కి పులివెందుల చేరుకుని పూల అంగళ్ల వద్ద సభలో ప్రసంగిస్తున్నారు. 13న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఆ రోజు 11.30కు యర్రగుంట్లలో సభలో మాట్లాడతారు. 12.25కు ముద్దనూరు మీదుగా జమ్మలమడుగు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. 6.30కు పాతబస్టాండు ప్రాంతంలో సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి  9.30కు ప్రొద్దుటూరు చేరుకుని వన్‌టౌన్‌ కూడలి, శివాలయం కూడళ్లలో నిర్వహించే సభలో మాట్లాడతారు. అక్కడ నుంచి నంద్యాల జిల్లాకు బయలుదేరి వెళతారని జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు పేర్కొన్నారు. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో షర్మిల పాల్గొన్నప్పటి నుంచి సునీత కూడా ఆమెకు తోడుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం పులివెందులలో వైఎస్‌ షర్మిల ఏపీ న్యాయ యాత్ర ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated :Apr 12, 2024, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details