TDP MLA Candidates State Wide Campaigns :సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు భారీగా పెరిగాయి.
TDP Campaigns in Anantapur District :ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ప్రచారం నిర్వహించారు. మహిళలు, వృద్ధులకు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతపురంలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 42వ డివిజన్లో ప్రచారం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పుట్టపర్తి ఏడో వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ లక్ష్మీపతి ఆయన సోదరుడు రామారావు అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Election Campaigns Road Shows in Nadyala : నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం వైకాపా సర్పంచ్ అర్జున్రెడ్డితో కలిసి 50 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకను కౌతాళంలో మహిళలు నిలదీశారు. కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.