ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయనగరం జిల్లాలో దారుణం - తల్లిదండ్రులను చంపిన కుమారుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 12:11 PM IST

Updated : Feb 23, 2024, 3:34 PM IST

Son Killed Parents in Vizianagaram District : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపాటి వివాదంలో కన్న తల్లిదండ్రులనే కడతేర్చాడు కుమారుడు. బొండపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. నీటి కుళాయి విషయంలో తండ్రి, కుమారుడి మధ్య ఘర్షణ చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

son_killed_parents_in_vizianagaram_district
son_killed_parents_in_vizianagaram_district

Son Killed Parents in Vizianagaram District :తల్లిదండ్రులను కత్తితో కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం S.C.కాలనీలో జరిగింది. డోల రాము అనే వ్యకి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మెుదటి భార్య కుమారుడు లక్షణరావు. రెండో పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో లక్ష్మణరావు పలుమార్లు బెదిరింపులకు పాల్పడేవాడు. కొన్ని రోజులుగా రాము తన రెండో భార్య జయలక్ష్మితో వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నిందితుడు కత్తితో దాడి చేయగా భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విజయనగరం జిల్లాలో దారుణం - తల్లిదండ్రులను చంపిన కుమారుడు
Last Updated : Feb 23, 2024, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details