ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు నగర ప్రజల ఆరోగ్య స్థితిపై వైద్యారోగ్య శాఖ మంత్రి సమీక్ష

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 5:42 PM IST

Minister Rajini Review Meeting: గుంటూరు నగర ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సమీక్ష సమావేేశం నిర్వహించారు. నగరంలో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు.

minister_rajini_review_meeting
minister_rajini_review_meeting

గుంటూరు నగర ప్రజల ఆరోగ్య స్థితిపై వైద్యారోగ్య శాఖ మంత్రి సమీక్ష

Minister Rajini Review Meeting: గుంటూరులో కలుషిత తాగునీరు తాగి ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. అయితే నగరంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తాజాగా సమీక్షించారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. నగరంలోని ప్రజలకు ప్రత్యేకంగా హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

గుంటూరులో కలుషిత నీరు తాగి ప్రజల ఆరోగ్యం క్షీణించడంపై, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, మేయర్, కమిషనర్, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రిలో చేరిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మొత్తం 41 మంది డయేరియా అనుమానిత లక్షణాలతో బాధ పడుతున్నట్లు మంత్రి రజని వివరించారు. వారందరూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారని తెలిపారు.

ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు

అనారోగ్యానికి గురైన వారిలో 8 మంది గుంటూరు నగరానికి చెందిన వారు కాదని మంత్రి వివరించారు. వారు గురజాల, మేడికొండూరు, పేరేచర్ల, సిరిపురం ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు. ఆహార, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం ప్రయోగ శాలకు పంపించామన్నారు. డయేరియా అనుమానిత కేసులు తాకిడి ఉన్న శారద నగర్ కాలనీలో ప్రత్యేకంగా వైద్య సేవలందిస్తున్నామన్న మంత్రి వివరించారు.

"కారణాలు తెలుసుకోడానికి కలెక్టర్​, కమిషనర్​ దర్యాప్తు చేస్తున్నారు. హౌస్​ టు హౌస్​ సర్వే చేపడుతున్నాము. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది ఇప్పటి పరిస్థితుల కోసం పనిచేస్తోంది" - విడదల రజని, వైద్యారోగ్య శాఖ మంత్రి

గుంటూరులో డయేరియా కలకలం - కలుషిత నీరు తాగి యువతి మృతి, 10 మందికి అస్వస్థత

నీటి కాలుష్యంపా నగర ప్రజల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. సహాయం 8341396104 నెంబర్​లో సంప్రదించాలని మంత్రి సూచించారు. రెండు వారాలుగా కలుషిత తాగునీటి సమస్య ఉందని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానాలకు మంత్రి సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో చికిత్స పొందుతున్న వారిని మేయర్‌ కావటి మనోహర్, కమిషనర్‌ చేకూరి కీర్తి పరామర్శించిన విషయం తెలిసిందే. అయితే వారు డయోరియా వాదనను కొట్టిపారేశారుగానీ, ప్రజల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు.

అప్రమత్తమైన గుంటూరు నగరపాలక అధికారులు- రెండ్రోజులు కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచన

ABOUT THE AUTHOR

...view details