కర్రలు, బెల్టులతో విద్యార్థిని చితకబాదిన దుండగులు

By

Published : Aug 18, 2022, 12:57 PM IST

thumbnail

కొందరు దుండగులు కలిసి ఓ విద్యార్థిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గోండా జిల్లాలోని మన్​కాపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తాలిబన్ల రీతిలో చితకబాదినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. కర్రలు, చెప్పులు, బెల్టులతో చిత్రహింస చేశారు. విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా.. కనికరించలేదు. చివరికి ప్రాణాపాయ స్థితిలో వదిలివెళ్లారు. దుండగులు విద్యార్థిని ఎందుకు కొట్టారో కారణాలు ఇంతవరకు తెలియలేదు. ఈ వీడియో ఆధారంగా దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ జిల్లా ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.