ETV Bharat / state

Minister Mallareddy : డబ్బులు నెత్తిన పెట్టుకొని యాదాద్రికి మల్లారెడ్డి

author img

By

Published : Oct 28, 2021, 12:53 PM IST

సుప్రసిద్ధ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో(Yadadri Lakshmi Narasimha Swamy temple) భాగంగా ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం కోసం అందరు తమకు తోచిన విరాళాలు అందించాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి(Telangana Minister Mallareddy) విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. మేడ్చల్ నియోజకవర్గం తరఫున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన నగదును యాదాద్రి ఆలయ అధికారులకు అందజేశారు.

Minister Mallareddy
Minister Mallareddy

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ(Yadadri Lakshmi Narasimha Swamy Temple) విమాన గోపురం బంగారు తాపడం కోసం మేడ్చల్ నియోజవర్గం తరపున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి(Telangana Minister MallaReddy) చెప్పారు. తన కుటుంబం తరఫున కిలో బంగారం, నియోజవర్గం తెరాస పార్టీ తరఫున రెండు కిలోలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

ఘట్​కేసర్‌లో మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో కలిసి యాదాద్రి ఆలయానికి ప్రదర్శనగా బయల్దేరి వెళ్లారు. మంత్రి మల్లారెడ్డి(Telangana Minister MallaReddy)కి ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం పలికారు. ముందుగా మల్లారెడ్డి కుటుంబ సమేతంగా.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం 3 కిలోల బంగారానికయ్యే నగదును ఆలయ అధికారులకు అందజేశారు.

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుడి(Yadadri Lakshmi Narasimha Swamy Temple).. ఆలయ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ (Cm Kcr) పిలుపు మేరకు.. ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం కోసం ఇప్పటికే విరాళాలు (Gold Donation For Yadadri) వెల్లువెత్తాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం విరాళమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr Gold Donation For Yadadri) ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి భారీగా బంగారం అవసరమని సీఎం తెలిపారు. విమాన గోపురానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విమాన గోపురానికి దాతలు బంగారం విరాళం ఇస్తామని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి(Telangana Minister MallaReddy) తన వంతుగా 3 కిలోల బంగారానికి సరిపడా నగదును చెక్కురూపంలో ఆలయ అధికారులకు అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.