ETV Bharat / state

ముజ్గిలో కరోనా కలకలం.. స్వచ్ఛంద లాక్​డౌన్​కు తీర్మానం

author img

By

Published : Aug 2, 2020, 10:37 PM IST

నిర్మల్​ జిల్లా ముజ్గి గ్రామంలో కరోనా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తికి కొవిడ్​ నిర్ధారణ అయ్యిందని అప్రమత్తమైన ప్రజలు గ్రామసర్పంచ్​ రాజమణి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటించేందుకు తీర్మానం చేసుకున్నారు.

self lock down at mujgi village in nirmal district
ముజ్గిలో కరోనా కలకలం.. స్వచ్ఛంద లాక్​డౌన్​కు తీర్మానం

నిర్మల్ జిల్లా ముజ్గి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటించేందుకు తీర్మానం చేసుకున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో సర్పంచ్ రాజమణి మల్లేశ్​.. గ్రామ పంచయతీ సిబ్బందితో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. బాధితున్ని చికిత్స నిమిత్తం నిజామాబాద్​కు తరలించారు.

వ్యాధిగ్రస్తుడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. గ్రామంలోని కిరాణా దుకాణాలు, హోటళ్లను మూసివేయించారు. ప్రజలు కొవిడ్​ నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని సర్పంచ్​ రాజమణి సూచించారు.

ఇదీ చదవండి: ఆ రాష్ట్ర గవర్నర్‌కు కరోనా పాజిటివ్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.