ETV Bharat / state

వరి పొలంలో మొసలి ప్రత్యక్షం

author img

By

Published : Apr 17, 2020, 3:05 PM IST

నల్గొండ జిల్లాలోని ఓ వరి పొలంలో ఆకస్మికంగా మొసలి ప్రత్యక్షమైంది. దానిని చూసి పనిచేస్తున్న కూలీలు భయబ్రాంతులతో పరుగులు తీశారు.

The crocodile was found on paddy farm land in Nalgonda
వరిపొలంలో మొసలి.. భయంతో పరుగులు తీసిన కూలీ

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నేతపురం గ్రామంలో రైతులు, కూలీలు వరిపొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా మొసలి కనిపించింది. దానిని చూసిన వారు భయంతో పరుగులు తీశారు. కొంతమంది యువకులు ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని తాళ్లుకట్టి బంధించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి దాన్ని పట్టుకుని తీసుకెళ్లారు.

వరిపొలంలో మొసలి.. భయంతో పరుగులు తీసిన కూలీ

ఇదీ చూడండి: సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.