ETV Bharat / state

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారుడు

author img

By

Published : Jul 7, 2020, 7:31 AM IST

Updated : Jul 7, 2020, 12:35 PM IST

son murdered his mother in nalgonda district of pa palli
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారుడు

07:29 July 07

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారుడు

      చెడు వ్యసనాలకు బానిసై కన్న తల్లినే కడతేర్చాడో కుమారుడు. చెప్పకుండా డబ్బులు తీశాడని మందలించినందుకు రోకలి బండతో మోది హతమార్చాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో జరిగింది.  

         బాలాజీనగర్​కు చెందిన మెగావత్ బుజ్జికి నలుగురు సంతానం. చిన్నవాడైన మున్నా.. మద్యానికి బానిసయ్యాడు. ఈ మధ్యనే తన అక్కకు కల్యాణ లక్ష్మి నగదు వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లో నుంచి రోజూ కొంత సొమ్ము తీసుకెళ్లేవాడు. సోమవారం.. డబ్బులు ఇవ్వలేకపోవడంతో తల్లితో గొడవపడ్డాడు. ఆగ్రహించి పక్కనే ఉన్న రోకలితో తల్లి తలపై బలంగా కొట్టాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

ఇవీచూడండి: ఆర్థిక ఇబ్బందులతో కేబుల్​ ఆపరేటర్​ ఆత్మహత్య

Last Updated : Jul 7, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.