ETV Bharat / state

ఎన్ఆర్ఐ ఔదార్యం..నిరుపేదలకు చిరుసాయం

author img

By

Published : Apr 20, 2020, 8:58 PM IST

Updated : Apr 21, 2020, 8:16 AM IST

విదేశాల్లో ఉన్నా స్వగ్రామంలోని పేదలకు తన వంతు సాయం చేస్తున్నాడో ఎన్నారై. లాక్​డౌన్ నేపథ్యంలో తిండికి ఇబ్బంది పడుతున్న వారికి కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నాడు.

చిట్యాలలో ఎన్​ఆర్​ఐ అమరేందర్ రెడ్డి  దాతృత్వం
చిట్యాలలో ఎన్​ఆర్​ఐ అమరేందర్ రెడ్డి దాతృత్వం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక అమరేందర్​రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో స్వగ్రామంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తన వంతు సాయంగా నిత్యవసరాలు అందజేస్తున్నారు. ఎన్నారై అమరేందర్​రెడ్డి ఆర్థిక సాయంతో ఏఎంఆర్ యూత్ సభ్యులు నిత్యం కూరగాయలు, కోడిగుడ్లు ప్రజలు అందిస్తున్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ, ముఖాలకు మాస్కులు ధరించి నిత్యవసరాలు స్వీకరిస్తున్నారు. ఏఎంఆర్ యూత్ తరపున తమకు నిత్యం కూరగాయలు అందిస్తున్న అమరేందర్​రెడ్డి దాతృత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక రజినీకాంత్​రెడ్డి, ఏఎంఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్ఆర్ఐ ఔదార్యం..నిరుపేదలకు చిరుసాయం

ఇవీ చూడండి : కరోనా కలవరం: దేశంలో 559కి చేరిన మృతుల సంఖ్య

Last Updated : Apr 21, 2020, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.