ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​లో నిరసన కొనసాగించిన కాంగ్రెస్​ నాయకులు

author img

By

Published : Oct 21, 2020, 10:16 AM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కల్వకుర్తి, వెల్దండ మండలకేంద్రాల్లో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. దీంతో వారు అక్కడే నిరసన కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన అమలు చేస్తుందని కల్వకుర్తి బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు విజయ్​ కుమార్ రెడ్డి విమర్శించారు.

పోలీస్​ స్టేషన్​లో నిరసన కొనసాగించిన కాంగ్రెస్​ నాయకులు
పోలీస్​ స్టేషన్​లో నిరసన కొనసాగించిన కాంగ్రెస్​ నాయకులు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆర్టీసీ డిపో ముందు ధర్నా​ చేపట్టిన నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. అలాగే వెల్దండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు పోలీస్​ స్టేషన్​లోనే నిరసనను కొనసాగించారు.

తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన అమలు చేస్తుందని, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే.. పోలీసులతో ఆపే ప్రయత్నం చేస్తుందని కల్వకుర్తి బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు విజయ్​ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రశ్నించే విధానానికి ముగింపు పలికి అణచివేసే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు కేఎల్ఐ వద్ద నీటమునిగిన మోటార్లకు ఇప్పటికైనా మరమ్మతులు చేసి సాగు, తాగునీరు అందించాలని విజయ్​ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కేఎల్‌ఐ పరిశీలన యత్నం.. విపక్షనేతల అరెస్టు..ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.