ETV Bharat / state

Seetakka: పోడు భూముల జోలికొస్తే ఊరుకోం: ఎమ్మెల్యే సీతక్క

author img

By

Published : Jun 25, 2021, 5:41 PM IST

పోడు భూములను సాగు చేసుకుంటోన్న గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలిస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరుల భూములను అటవీశాఖ అధికారులు అన్యాయంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీలపై అధికారుల దౌర్జన్యాలను ఆపాలంటూ.. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంప్లెక్స్​ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.

MLA Sitakka protests against forest officials' attacks on tribals
గిరిజనులపై అటవీ అధికారుల దాడులను నిరసిస్తూ ఎమ్మెల్యే సీతక్క నిరసన

ఎన్నో ఏళ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటోన్న గిరిజనులు, గిరిజనేతరుల భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆమె మండిపడ్డారు. ఆదివాసీలపై అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంపెక్స్​లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.

పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు

ములుగు జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల్లో వందల ఏళ్లుగా గిరిజనులు, గిరిజనేతరులు జీవనం సాగిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితమే పోడు చేసి వ్యవసాయం చేసుకుంటున్న వారి భూములను హరితహారం పేరుతో అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. తాతల కాలం నుంచి సాగులో ఉన్న పోడు భూముల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదు

అటవీ బిడ్డల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఇకనైన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పోడు భూముల్లో సాగు చేసుకుంటోన్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆమె కోరారు. పోడు భూములకు పట్టాపాసు పస్తుకాలిస్తామన్న సీఎం హామీలు మాటలకే పరిమితమయ్యాయని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేశ్​రెడ్డి విమర్శించారు. 2015-16లో అటవీ హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనులపై అటవీ అధికారుల దాడులు కొనసాగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: KTR: రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్​ ప్లాంట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.