ETV Bharat / state

కిలోకి 300గ్రాములు ఫసక్.. డీమార్ట్​లో మోసం!

author img

By

Published : May 18, 2020, 5:06 PM IST

Updated : May 18, 2020, 5:30 PM IST

దేశంలో అనేక నగరాలలో ఉండే సూపర్ మార్కెట్లలో డీమార్ట్ కూడా ఒకటి. ఇతర సూపర్ మార్కెట్లతో పోలిస్తే డీమార్ట్ చాలా బెస్ట్ అని చాలామంది అభిప్రాయం. కానీ మేడ్చల్​ జిల్లా కుషాయిగూడలోని డీమార్ట్​లో తాజాగా ఓ ఘరానామోసం బయటపడింది.

huge fruad in d-mart in hyderabad
కుషాయిగూడ డీమార్ట్​లో ఘరానా మోసం!

మేడ్చల్​ జిల్లా కుషాయిగూడలోని డీమార్ట్​లో అన్నిరకాల వస్తువుల కొలతల్లో తేడాలు రావడం వల్ల వినియోగదారులు ఆందోళన చేపట్టారు. తూకాల్లో మోసం జరిగిందంటూ డీమార్ట్​లోనే వినియోగదారులు ఆందోళనకు దిగారు. తప్పు జరిగింది క్షమించాలి అంటూ సిబ్బంది బతిమిలాడారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ అభ్యర్థించారు.

తూకాల్లో కిలోకు 300 గ్రాముల చొప్పున తక్కువ రావడం వల్ల జరిగిన మోసాన్ని నిలదీస్తూ డీమార్ట్​లో శివ సాయినగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, ఇతర వినియోగదారులు ధర్నాకు దిగారు. డీమార్ట్​లో ఆయా సరకుల తూకాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ బాధితుని ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు సంబంధిత వేయింగ్ మిషన్​ను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన వారిపై పోలీసులు, తూనికలు-కొలతల శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: ఈ నెల 22న కార్మికుల దేశవ్యాప్త సమ్మె

Last Updated : May 18, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.