ETV Bharat / state

సమీకృత వ్యవసాయం లాభదాయకం: మెదక్​ కలెక్టర్​

author img

By

Published : Feb 4, 2019, 3:59 AM IST

సమీకృత వ్యవసాయ విధానంపై మెదక్​లో అవగాహన సదస్సు నిర్వహించారు. సమీకృత వ్యవసాయం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ సుభాష్​రెడ్డి, కలెక్టర్​ ధర్మారెడ్డి  హాజరయ్యారు. జిల్లాలోని 20 మండలాల అన్నదాతలతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు.

సమీకృత వ్యవసాయం

సమీకృత వ్యవసాయం
అధికారం చేతిలో ఉన్నా వ్యవసాయం మీద మక్కువ తగ్గలేదు ఆ అధికారికి. తనకున్న పోలంలో ప్రయోగాత్మకంగా పంటలు పండించి ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్​ సుభాష్​రెడ్డికి మెదక్​లో వ్యవసాయక్షేత్రం ఉంది. ప్రాచీన పద్దతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారు. వరి, చెరకు పంటలకు ప్రత్యామ్నయంగా బంగాళదుంప, గుమ్మడి సాగు చేసి రూ.80 వేలు లాభాన్ని పొందారు.
మెదక్ జిల్లాలో మొదటిసారిగా బంగాళదుంప పండడంపై కలెక్టర్​ ధర్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగాలు చేసి లాభాలు ఆర్జించిన ఖనిజశాఖ ఛైర్మన్​ను అభినందించారు. రైతులందరూ ఈ పద్ధతులను అనుసరించాలని కోరారు. సమీకృత వ్యవసాయ విధానం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా నష్టం తక్కువగా ఉంటుందని రైతులకు వివరిచారు. ఒకే రకమైన పంటలు వేస్తే గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడతారని వాటికి అనుబంధ పంటలు ద్వారా నష్టాన్ని భర్తీచేయవచ్చని పేర్కొన్నారు.


sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.