ETV Bharat / state

సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

author img

By

Published : Nov 15, 2020, 1:39 PM IST

సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం రూ. 2500 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయిలో రైతులు ఆందోళనకు దిగారు. గ్రామ సహకార సంఘం కార్యాలయం గేటుకు తాళం వేశారు.

farmers protest for support price for Thinner paddy in medak district
సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయిలో రైతులు ఆందోళన చేపట్టారు. సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం రూ. 2500 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ సహకార సంఘం కార్యాలయం గేటుకు తాళం వేశారు. కార్యాలయం ఆవరణలో సీఈఓ బాలకిష్టయ్య, అటెండర్ కుమార్​ను నిర్బంధించారు. సన్నరకం ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు.

గ్రామగ్రామానికి వ్యవసాయ అధికారులను పంపించి సన్నరకం పంట వేయాలని ప్రచారం చేయించారని అన్నదాతలు చెప్పారు. వారి మాట నమ్మి సన్నరకం సాగు చేస్తే మద్దతు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు.

సన్నరకం వరి వేయడం ద్వారా వివిధ రకాల చీడపీడలు ఆశించాయన్నారు. అనేక రసాయనాలను పిచికారి చేయడానికి ఎకరానికి 6 వేల రూపాయలు అదనంగా ఖర్చు చేశామని రైతులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ. 2500కు సన్నరకం వడ్లను కొనుగోలు చేయాలన్నారు. మద్దతు ధర కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.

సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

ఇదీ చదవండి: ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై కేసీఆర్ కీలక సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.