గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తాను మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నట్లు కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి చెప్పారు. గతంలో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఛాలెంజ్లో భాగంగా కోటి మొక్కలను నాటే ప్రక్రియ పూర్తి అయ్యిందని సీపీ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ విసిరిన ఛాలెంజ్లో భాగంగా తాను మూడు మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్లో భాగంగా ఆహ్వానిస్తున్నట్లు సీపీ తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య, సంయుక్త కలెక్టర్ శ్యాంప్రసాద్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మొక్కలు నాటేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని లేని పక్షంలో స్వచ్ఛమైన గాలి లభించక మాస్క్ పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సీపీ హెచ్చరించారు.
గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కరీంనగర్ సీపీ
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో తాను మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నట్లు కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి చెప్పారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తాను మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నట్లు కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి చెప్పారు. గతంలో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఛాలెంజ్లో భాగంగా కోటి మొక్కలను నాటే ప్రక్రియ పూర్తి అయ్యిందని సీపీ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ విసిరిన ఛాలెంజ్లో భాగంగా తాను మూడు మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్లో భాగంగా ఆహ్వానిస్తున్నట్లు సీపీ తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య, సంయుక్త కలెక్టర్ శ్యాంప్రసాద్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మొక్కలు నాటేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని లేని పక్షంలో స్వచ్ఛమైన గాలి లభించక మాస్క్ పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సీపీ హెచ్చరించారు.