కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూర్లో గ్రామస్థులకు, విద్యుత్ శాఖ అధికారుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. తమ అనుమతి లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ఇళ్లలోని ప్రవేశించారంటూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని గ్రామస్థులపై విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
గత వారంలో విద్యుత్ చౌర్యాన్ని గుర్తించేందుకు ఆ శాఖ అధికారులు సోమూర్ గ్రామానికి వెళ్లారు. వారిని అడ్డుకున్న గ్రామస్థులు.. జుక్కల్ సబ్ ఇంజినీర్ నవీన్తో పాటు ఆరుగురు ఏఈలు, ఇతర అధికారులపై దాడి చేశారు. రెండు రోజుల క్రితం మరోసారి సోమూర్ గ్రామంలో ఇళ్లలో ఏర్పాటుచేసిన విద్యుత్ మీటర్లను బయట అమర్చేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇరువురు మరోసారి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఇవీ చూడండి: పంట నష్టపోతే రైతులకు పరిహారం అందిస్తాం