ETV Bharat / state

పాఠశాల రంగులపై కలెక్టర్​కు భాజపా ఫిర్యాదు

author img

By

Published : Feb 27, 2021, 4:47 PM IST

ప్రభుత్వ పాఠశాలలకు గులాబీ రంగులు వేయడంపై భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన భాజపా నాయకులు కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు.

bjp-leaders-complaint-to-collector-on-trs-colours-to-the-govt-schools-in-basannapalli-villagein-kamareddy-district
పాఠశాల రంగులపై కలెక్టర్​కు భాజపా ఫిర్యాదు

పాఠశాల రంగులపై తెరాస నాయకుల అత్యుత్సాహం ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పాఠశాలకు గులాబీ రంగులపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నాయకులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన భాజపా నాయకులు ఆరోపించారు.

గ్రామ సంఘాల విరాళాలతో సేకరించిన డబ్బులతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు గులాబీ రంగులు వేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గౌడ సంఘం ద్వారా రూ.1.25 వేలు రాగా పాఠశాలకు తెరాస రంగు ఎందుకు వేస్తున్నారని భాజపా గ్రామ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విఠల్ రెడ్డిని వివరణ కోరగా.. రంగులు వేయడంపై తన ప్రమేయం ఏమి లేదన్నారు. పాఠశాల కమిటీ ఛైర్మన్లు, గ్రామస్థుల నిర్ణయం ప్రకారమే వేస్తున్నారని ఆయన బదులిచ్చినట్లు భాజపా నాయకులు వెల్లడించారు.

ఇదీ చూడండి : పట్టభద్రుల పోరులో విజయమే లక్ష్యంగా భాజపా వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.