ETV Bharat / state

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళ

author img

By

Published : Sep 29, 2021, 9:42 AM IST

Updated : Sep 29, 2021, 11:08 AM IST

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది జలకళను సంతరించుకుంది. భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పుష్కరఘాట్​ను తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి (Godavari and Pranahita rivers flowing as excerpts).

Godavari
Godavari

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు పుష్కర ఘాట్​ను తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి(Godavari and Pranahita rivers flowing as excerpts). విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరు వస్తుంది.

పుష్కర ఘాట్లపై ఉన్న దుకాణాల్లోకి వరద నీరు చేరింది. త్రివేణి సంగమం వద్ద 12.600 మీటర్ల మేర ప్రవాహం కొనసాగుతోంది. ప్రవాహం ఉద్ధృతంగా ఉండడం వల్ల గోదావరి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నదిలో పూజా కార్యక్రమాలకు, స్నానాలకు దిగేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

ఎగువ నుంచి వరదనీరు భారీగా వస్తుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గోదావరిలో ప్రస్తుతం 5,71,070 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ప్రస్తుత నీటి మట్టం 34.7 అడుగుల వద్ద ఉంది.

ఇదీ చూడండి: GULAB EFFECT ON HYD: హైదరాబాద్​ను వణికించిన మూసీ వరద.. పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్​

Last Updated : Sep 29, 2021, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.