ETV Bharat / state

కూలీ పనిచేసుకునే వారికి రూ.2వేల కరెంట్ బిల్

author img

By

Published : Aug 17, 2020, 3:02 PM IST

జగిత్యాల జిల్లా సారంగపూర్​ రేచపల్లిలో అధిక విద్యుత్ బిల్లు వసూలుపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే బిల్లులు తగ్గించాలని గ్రామ పంచాయతీ ముందు నిరసన చేశారు.

విద్యుత్ బిల్లులు అధికంగా వేశారని గ్రామస్థుల ఆందోళన
విద్యుత్ బిల్లులు అధికంగా వేశారని గ్రామస్థుల ఆందోళన

జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం రేచపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అసలే కూలీ చేసుకునే వారికి నెలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు రావటంతో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ వద్దకు చేరుకున్న గ్రామస్థులు అధిక విద్యుత్తు బిల్లులను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.

ఇంత మొత్తంలో ఎలా వేస్తారు...

కూలీ చేసుకుని జీవించే తాము రెండు బల్బులు, ఫ్యాను వాడినందుకునే ఇంత మొత్తంలో బిల్లులు ఎలా వేస్తారని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించారు. గతంలో బిల్లు రూ.300 వరకు మాత్రమే వచ్చేదని.. ఇప్పుడు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధిక బిల్లులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇవీ చూడండి : ఉప్పొంగుతున్న గోదావరి... 60 అడుగులకు చేరిన నీటిమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.