ETV Bharat / state

ఆమె ఈమే అనుకుని: యువతి జుట్టు పట్టి లాగి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

author img

By

Published : Mar 27, 2023, 10:05 AM IST

Updated : Mar 27, 2023, 10:15 AM IST

Youngmen
Youngmen

Youngmen Attack on Young Woman with Stick : సాధారణంగా నగరంలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే చాలా మంది జీపీఎస్ ఆధారంగా చేరుకుంటుంటారు. కొన్నిసార్లు దానివల్ల సమయం ఆదా అవుతుంటే.. మరికొన్ని సార్లు తప్పుడు లొకేషన్ కారణంగా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఈ జీపీఎస్ కారణంగా స్నేహితులతో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్తున్న ఓ యువతి దాడికి గురైంది. అసలు ఏమైందంటే..?

Youngmen Attack on Young Woman with Stick : నేటి ఆధునిక సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచే చాలా మందికి మద్యపానం అలవాటుగా మారుతోంది. చిన్న చిన్న వేడుకలు, పార్టీలతో సరదాగా మొదలై.. ఆ తర్వాత సామాజిక మర్యాదగా మారి, చివరికి వీడని వ్యసనంగా మారుతోంది. దాంతో సామాజిక బంధాల్ని, కుటుంబ సభ్యులతో అనుబంధాల్ని సరిగా ప్రదర్శించలేకపోతున్నారు. ముఖ్యంగా యువతలో ఆ మత్తులో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇలాంటి ఘటనలు శృతి మించిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్​లో మద్యం మత్తులో కొందరు యువకులు బైక్​పై వెళ్తున్న ఓ యువతిపై దాడికి పాల్పడడమే కాకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలిలా.. ఖమ్మం జిల్లాకు చెందిన 21 సంవత్సరాల ఓ యువతి అడ్డగుట్ట సొసైటీలోని ఉమెన్స్ హాస్టల్​​లో ఉంటూ చదువుకుంటోంది. అయితే వీకెండ్ కావడంతో శనివారం ఆ యువతి తన తోటి స్నేహితులతో కలిసి బిర్యానీ తిందామని అలా బంజారాహిల్స్​ రోడ్ నంబర్ 2లోని బిర్యానీ వాలాకు వెళ్లేందుకు మూడు బైక్​లపై ఆరుగురు బయలుదేరారు. ఆ యువతి ఒక ద్విచక్రవాహనం వెనుక కూర్చుంది. ఈ క్రమంలో వారు లొకేషన్ పెట్టుకొని వారు వెళ్లాల్సిన చోటుకి జీపీఎస్ ఆన్ చేశారు. బేగంపేట వైపు నుంచి బంజారాహిల్స్​కు వెళ్తుండగా పంజాగుట్ట కూడలి దాటగానే జీపీఎస్ పంజాగుట్ట శ్మశానవాటికపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని చూపించింది.

జీపీఎస్ తప్పు చూపించడంతో : ఆ మార్గంలో వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు మరో ద్విచక్రవాహనంపై వెళ్తూ ఆ యువతిని దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఆ ఆకతాయిలను దాటుకొని ముందుకు వెళ్లగా ఆ వైపు నుంచి దారి లేకపోవడంతో(జీపీఎస్ తప్పు చూపించడంతో) తిరిగి వెనక్కి వస్తున్నారు. అలా వెనక్కి వస్తున్న క్రమంలో అంతకుముందు దుర్భాషలాడిన యువకుల్లో ఒకరు యువతిపై కర్రతో దాడికి పాల్పడ్డారు. ఇంకో వ్యక్తి యువతి జుట్టు పట్టుకొని లాగడంతో బైక్​పై వెళ్తున్న ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. అలానే యువతి జుట్టు పట్టుకొని ఆకతాయి కొంతదూరం లాకెళ్లాడు. యువతి స్నేహితులు వెంటనే అప్రమత్తమై మద్యం మత్తులో ఉన్న వారిని పట్టుకొని దగ్గరలోని బంజారాహిల్స్​ పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి అప్పగించారు. ఆ యువకులు పంజాగుట్టకు చెందిన కొండ గోపి, పోచమ్మబస్తీకి చెందిన పుణ్యసాయి కల్యాణ్​గా గుర్తించారు.

అయితే అసలు విషయం ఏమిటంటే.. ఆ ఆకతాయిలకు అంతకుముందే మరో యువతితో గొడవ జరగడం, కొద్ది సమయం తరువాత అదే దారిలో వచ్చిన ఈమెను చూసి వారు అంతకుముందు గొడవపడిన యువతిగా భావించి.. దాడి చేసినట్లు నిందితులు విచారణలో పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 27, 2023, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.