Ticket Clashes in Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటించిన తర్వాత టికెట్ దక్కని నాయకులు అలకపూనుతున్నారు. మరికొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంకొందరు పోటీ చేసి తీరతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) శుక్రవారం రాత్రి 45 మందితో కూడిన రెండో జాబితా ప్రకటించింది. దీంతో టికెట్ దక్కని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Munugode Congress MLA Ticket Issue : మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Rajagopal Reddy)కి ఇవ్వడంతో.. అక్కడ టికెట్ కోసం చివర వరకు వేచి చూసిన చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీరిద్దరు కూడా కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది. చలమల కృష్ణారెడ్డి చౌటుప్పల్లో కార్యకర్తలతో సమావేశమవుతుండగా.. పాల్వాయి స్రవంతి హైదరాబాద్ శివారులో జేవీ స్వాగత్ కన్వెన్షన్ హాలులో కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఇంతకాలం తమకే టికెట్ వస్తుందని ఇద్దరు పని చేసుకుంటూ పోతుండగా.. అప్పటికప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన రాజగోపాల్రెడ్డికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Congress Tickets War in Telangana : జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని భావించి గత కొంత కాలంగా పని చేసుకుంటూ వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డికి కాకుండా పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అజారుద్దీన్కు ఇచ్చారు. ఖైరతాబాద్ టికెట్ తనకు ఇవ్వకపోవడంపై కినుక వహించిన విష్ణువర్ధన్ రెడ్డి దోమలగూడలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. తాను ఐదు ఎన్నికలు చూశానని.. కానీ ఇలాంటి ఎన్నికలు చూడలేదని ఆరోపించారు. తాను తన కార్యకర్తల కోసం పోటీ చేసి తీరుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కో ఇంట్లో రెండు టిక్కెట్లు ఇచ్చారని, తన ఇంట్లో రెండు టికెట్లు ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. పార్టీకోసం కష్టపడ్డానని, హైదరాబాద్ కాంగ్రెస్ అనగానే పీజేఆర్ గుర్తొస్తుందన్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీలో ఉంటానని వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
Congress Leader Cried for Not Getting Ticket : ఎల్లారెడ్డి అసెంబ్లీ టికెట్ ఆశించిన వడ్డేపల్లి సుబాశ్రెడ్డి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కార్యకర్తల ముందరే బోరున ఏడ్చేశారు. కాంగ్రెస్ నాయకులు(Congress Leader), కార్యకర్తుల ఓదార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీసీసీ అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. కాంగ్రెస్ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ను గెలవనివ్వనని చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతానని పేర్కొన్నారు. కామారెడ్డిలో రేవంత్రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. గత ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Congress Dissatisfied Leaders Resignations in Telangana : మైనారిటీ డిపార్టమెంట్ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి ఎన్నిమిది పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖ రాశారు. 34 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన తాను ఎంతో బాధతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణాలో వాస్తవ కాంగ్రెస్ను రేవంత్రెడ్డి చంపేశారని ఆరోపించారు. కూకట్పల్లి టికెట్ ఆశించిన నిరాశకు గురైన గొట్టిముక్కల వెంగలరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి రాజీనామా లేఖ పంపారు. ఈ సంతృప్తుల సెగ ఇంతటితో ఆగే అవకాశం లేకపోగా.. బుజ్జగింపుల కార్యక్రమం కూడా ఊపందుకోనుంది.