ETV Bharat / state

Disha Encounter: 'న్యాయం కోసమే సిర్పూర్కర్ కమిషన్​ను ఆశ్రయించా'

author img

By

Published : Sep 4, 2021, 9:52 PM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది. ఈనెల 1న మొదలైన మలి విడత విచారణ ఈరోజు వరకు కొనసాగింది. సిట్ అధికారి సురేందర్ రెడ్డితో పాటు సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగి రాజశేఖర్​ను కమిషన్ ప్రశ్నించింది.

Sirpurkar Commission
సిర్పూర్కర్ కమిషన్

దిశ ఎన్​కౌంటర్​(Disha Encounter)లో తమ కుమారుడు చనిపోయాడని... తగిన న్యాయం చేయాలని మృతుడు ఆరిఫ్ తండ్రి హుస్సేన్, సిర్పూర్కర్ కమిషన్​ను కోరారు. నష్ట పరిహారం కోసమే అఫిడవిట్ దాఖలు చేశారా అని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు... న్యాయం కోసమే కమిషన్​ను ఆశ్రయించినట్లు హుస్సేన్ తెలిపారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) విచారణ నిర్వహించింది. ఈనెల 1న మొదలైన మలి విడత విచారణ శనివారం వరకు కొనసాగింది. సిట్ అధికారి సురేందర్ రెడ్డితో పాటు సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగి రాజశేఖర్​ను కమిషన్ ప్రశ్నించింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హుస్సేన్​ను ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

ఉమామహేశ్వర్ రావు అడిగిన పలు ప్రశ్నలకు హుస్సేన్ చెప్పిన సమాధానాలను కమిషన్ నమోదు చేసుకుంది. ఈనెల 13 నుంచి 17 వరకు మరోసారి విచారణ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఆరిఫ్ తండ్రి హుస్సేన్ నుంచి మాత్రమే కమిషన్ వాంగ్మూలం తీసుకుంది. మిగతా ముగ్గురు మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​కు నేతృత్వం వహించిన మహేశ్ భగవత్... ఈరోజు కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. మహేశ్ భగవత్​ను కమిషన్ విచారించాల్సి ఉంది. కానీ మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకోవడం పూర్తి కాకపోవడంతో మహేశ్ భగవత్ వెళ్లిపోయారు. ఈనెల 13 తర్వాత మహేశ్ భగవత్​ను కమిషన్ విచారించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

Rains In Hyderabad: తడిసిముద్దైన భాగ్యనగరం.. కాలనీలు జలమయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.