TS Mandali Protem chairman : శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ప్రస్తుతం మండలి ఛైర్మన్ బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహించే వారు లేకుండా పోయారు. దీంతో ఆయన ప్రొటెంగా కొనసాగేందుకు అవకాశం లేదు. ఈ లోగా మండలి ఛైర్మన్ ఎన్నిక జరగనందున మరొకరిని ప్రొటెం ఛైర్మన్గా నియమించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
కానీ, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కాలేదు. దీంతో ప్రస్తుతం మండలి ఛైర్మన్ బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహించే వారు లేకుండా పోయారు. ప్రొటెం ఛైర్మన్ నియామకం కోసం రాజ్భవన్కు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. గవర్నర్ ఆమోదం అనంతరం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
అప్పట్లో కూడా ఎన్నికలు జరగలేదు..
శాసనమండలి ప్రొటెం ఛైర్మన్గా ఈనెల 4వరకు మెదక్ జిల్లా స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఛైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం గతేడాది జూన్ మూడో తేదీతో ముగిసింది. అప్పట్లో కొత్త ఛైర్మన్ ఎన్నికతో పాటు ఖాళీ అయిన స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సభలో సీనియర్ సభ్యుడైన భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్గా నియమించారు. అప్పటి నుంచి ఆయనే మండలి కార్యకలాపాలను నిర్వర్తించారు. ఆయన తిరిగి పెద్దల సభకు ఎన్నిక కాలేదు. దీంతో మండలి కార్యకలాపాలు పర్యవేక్షించేవారు లేకుండా పోయారు.
ఇదీ చూడండి : Telangana Council new protem chairman : నేడు శాసనమండలి నూతన ప్రొటెం ఛైర్మన్ నియామకం